17-01-2026 11:26:08 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సంక్రాంతి సెలవులు ముగించుకొని విధి నిర్వహణలో భాగంగా నల్గొండ నుండి తుంగతుర్తి మండలానికి విచ్చేయుచున్న పలువు ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా కొట్టగా, తుంగతుర్తి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ కల్పన అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోపాటు తుంగతుర్తి హెడ్మాస్టర్ ప్రవీణ్ కుమార్, రావులపల్లి హెడ్మాస్టర్ గీతారెడ్డి, అన్నారం హెడ్మాస్టర్ సునీత రాణి ఇందులో గీత రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది, హైదరాబాద్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు