18 July, 2026 | 1:31 PM

Breaking News

కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ సవాల్‌   •   Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •  

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

17-01-2026 12:23 PM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో(Bijapur District) శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని వాయువ్య ప్రాంతంలోని అటవీ కొండల్లో ఉదయం వేళ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా బలగాల సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు. 

ఇప్పటివరకు ఆ ప్రదేశం నుండి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అక్కడ అడపాదడపా కాల్పుల మార్పిడి జరుగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీన, బీజాపూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఏకంగా 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. గత సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 285 మంది నక్సలైట్లు మరణించారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 31ని గడువుగా నిర్దేశించిన విషయం తెలిసిందే.