ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో(Bijapur District) శనివారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని వాయువ్య ప్రాంతంలోని అటవీ కొండల్లో ఉదయం వేళ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు కార్యకర్తలు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా బలగాల సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు ఆ ప్రదేశం నుండి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అక్కడ అడపాదడపా కాల్పుల మార్పిడి జరుగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీన, బీజాపూర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఏకంగా 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. గత సంవత్సరం ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 285 మంది నక్సలైట్లు మరణించారు. వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 31ని గడువుగా నిర్దేశించిన విషయం తెలిసిందే.




