calender_icon.png 17 June, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితో భూ సమస్యల పరిష్కారం

13-06-2025 02:05:10 AM

నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి 

నారాయణఖేడ్/ నాగల్గిద్ద/ మనూర్, జూన్ 12: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి భూభారతి తీసుకురావడం జరిగిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి చట్టంలో అనేక లోపాలు ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. గురువారం నాగలగిద్ద మండలం శేరిదామర్ గిద్దలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే పా ల్గొని మాట్లాడారు.

భూభారతి వల్ల అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించడం జరుగుతుందని సూచించారు. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకెళ్తామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

మనూరు మండలంలో బడిబాట కార్యక్రమం లో భాగంగా మాయికోడు గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు , యూనిఫాములు అందజేశారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపే తం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆయా మండల అధికారులు, నాయకులు మాజీ ఎంపీటీసీ పండరి పటేల్, సచిన్ పాటిల్, రహీం, శివరాజ్, బ్రహ్మా నంద రెడ్డి, దిగంబర్ రెడ్డి, సిద్ధారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులుపాల్గొన్నారు.