05-12-2025 09:14:39 PM
చేర్యాల: చేర్యాల మండలంలోని పోతిరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసుకువాలని చుసిన కొంత మంది అభ్యర్థులు గ్రామానికి అందరికి ఉపయోగపడే విధంగా గ్రామ అవసరాలకు ఉపయోగ పడే విధంగా సుమారు రూ.75 లక్షల విలువైన భూమిని గ్రామానికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో గ్రామంలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో శుక్రవారం గ్రామంలోని యువకులు నామినేషన్లు వేయడంతో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలని చూసిన ఆ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.