23 June, 2026 | 7:30 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

మంత్రి శ్రీధర్ బాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి

05-12-2025 09:54 PM

మంథని,(విజయక్రాంతి): స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయుటకు నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులు మంథని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కావలసిన నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి, పెద్ద ఎత్తున సమకూరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.  కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న అభ్యర్థుల వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ నాయకులపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని గోటికార్ కిషన్ జీ తెలిపారు.