27 March, 2026 | 1:22 PM

హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

27-03-2026 11:41 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర(Sri Rama Navami Shobha Yatra) కొనసాగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాలు మళ్లిస్తారు. సీతారాం బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభ యాత్ర సాగే మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో శ్రీరామనవమి శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్, బైంసా పట్టణాల్లో శ్రీరాముని శోభాయాత్ర కొనసాగుతోంది. నిర్మల్ లో 400 మంది, బైంసాలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.