17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

‘ఆస్ట్రేలియా వర్సిటీ’తో అత్యాధునిక నైపుణ్య శిక్షణ

30-04-2025 01:25 AM
  1. యువతకు పెరగనున్న ఉపాధి అవకాశాలు
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): రాష్ర్టంలో ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించే యూనివర్సిటీ ఏర్పాటుకు ఆస్ట్రేలియా వాణిజ్య ప్రతినిధులు ముందు కు రావడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. తాము నెలకొల్పుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ విశ్వవిద్యాలయానికి తోడు మరో ఉన్నత స్థాయి టెక్నాలజీ క్యాంపస్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయనన్నారు.

మంగళవారం సచివాలయంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. కృత్రి మ మేథ వేగంగా విస్తరిస్తున్న వేళ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 3 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో పాటు, చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు నూతన నైపుణ్యాల శిక్షణ అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు.

విద్య, పరిశ్రమ అవసరాలకు మధ్య నైపుణ్య లేమికి సంబంధించిన అగాథం ఉందని, దీన్ని పూడ్చగలిగే అత్యాధునిక శిక్షణ కేంద్రాలు పెద్ద ఎత్తున రావా ల్సిన అవసరం ఉందన్నారు. తమ యూనివర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు సృష్టిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు చెప్పడం బాగుందన్నారు.

అయితు పూర్తి వివరాలు, స్పష్టమైన ప్రతిపాదనతో వస్తే ప్రభుత్వ పరంగా ఏం చేయగలమనేది ఒక అభిప్రాయానికి రాగలమని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి అనుబంధంగా ఇన్ క్యుబేషన్ కేంద్రాలు, పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం రాష్ర్ట ప్రగతికి తోడ్పడు తుందన్నారు.

శాటిలైట్ల నిర్మాణం, డ్రోన్ టెక్నాలజీ 3-డి డిజైనింగ్, బయో సెన్సైస్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో శిక్షణ అందించడానికి కరికులమ్ సిద్ధం చేస్తామని వెల్లడించారు. తాము ఇప్పటికే టీ-వర్క్స్ లో త్రీడీ ప్రోటో టైపింగ్ సేవలు అందిస్తున్నామని, అంకుర సంస్థల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించామన్నారు.

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంలో సిడ్నీ బోర్గ్, నీలిమా చౌదరి, హైడన్ షటిల్ వర్త్, సురేన్ పథర్, యాండ్రే స్కోమన్, కొల్లా నాగ లోకేశ్ తదితరులు ఉన్నారు.