భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్
భద్రాచలం, మార్చి 19, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దంపతులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం నాడు ఉదయం స్వామి వారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవస్థానం పర్యవేక్షకుడు సాయిబాబా మరియు అర్చక స్వాములు దేవస్థానం సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు.
ముందుగా బలపీఠం వద్ద పూజలు నిర్వహించి, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి పట్టు వస్త్రాలు అందించి స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, టౌన్ ఎస్ఐ రామకృష్ణ ప్రసాద్ మరియు అర్చకస్వాములు తదితరులు పాల్గొన్నారు.




