17-07-2025 12:27:32 AM
-మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 16 (విజయ క్రాంతి) : పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న సిబ్బంది భద్రంగా ఉండడంతో పాటు బాధ్యతగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్, సీవర్ నెట్వర్క్ ఆపరేటర్లకు ఆయుష్మాన్ కారడ్స్ పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్ ని అందజేశారు. ప్రతి ఒక్క సీవర్ నెట్వర్క్ ఆపరేటర్ను ధరించి క్లీనింగ్ ఆక్టివిటీస్ చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వజ్ర కు మార్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, శ్రీ చరణ్ రెడ్డి, ఎస్బిఎం కన్సల్టెంట్ సుమిత్ పాల్గొన్నారు.