18-09-2025 12:00:00 AM
నిర్మల్, సెప్టెంబర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండల కడ్తాల్లో భారీ వర్షాలకు తెగిపోయిన చెరువును బుధవా రం కలెక్టర్ అభిలాష అభినవ్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సందర్శించారు. గండిని త్వరగా పూర్తి చేసినందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నాయన ప్రభు త్వం ద్వారా భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు నాయకులు మొయినుద్దీన్ పాల్గొన్నారు.