calender_icon.png 17 February, 2026 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యునెస్కో గుర్తింపునకు చర్యలు

16-02-2026 12:00:00 AM

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 15: పానగల్ చాయా సోమేశ్వరాలయానికి కేంద్ర ప్రభుత్వం యునెస్కో గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలలో అయన ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు వందల ఏళ్ల చరిత్ర గలిగిన చారిత్రాత్మకత కలిగిన ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాలకు యునెస్కో గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలిని కోరారు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఈ ఆలయాలను సందర్శించి వందల ఏళ్ల చరిత్రను తెలుసుకుంటున్నారని తెలిపారు. 11-12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాలలో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుంది అని తెలిపారు.

ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎప్పుడు ఒకేలా నీడ నిచ్చలంగా ఉండడం ఇక్కడ ఒక అద్భుతం అన్నారు మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ కార్పొరేషన్ గెలిపించి ప్రజలు గిఫ్టుగా ఇచ్చారు అని.మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం జరుగుతుంది వివరించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆబ్బ గోని రమేష్ గౌడ్, అళ్లీ సుభాష్ యాదవ్, ఆలకుంట్ల నాగరత్నం రాజు తదితరులు ఉన్నారు.