15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ

30-01-2026 12:45 AM

ఎన్నికల నిర్వహణ పక్కాగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్

తాండూరు, జనవరి29 (విజయ క్రాంతి):  జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. 

1 నుండి 36 వార్డులు 12 కౌంటర్లు, 12 మంది ఆర్ ఓ లు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు దాఖ లు చేసే విషయం లో  అభ్యర్థు లకు అవసరమైన సహకారం అందించాలని, ఏమైనా సందేహాలు ఉంటే సొంత నిర్ణయం తీసుకోకుండా పై అధికారులను సంప్రదించాలని సిబంది కి సూచించారు.  జిల్లాలో మొత్తం 100 వారడ్స్, 261 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం తో పాటు 54 సమస్యా త్మ క లొకేషన్ లు గుర్తించి పూర్తి స్థాయి లో పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ ఓ లు, ఓ ఆర్  ఓ లు 20% అదనంగా  సిబ్బంది ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా చూస్తామన్నారు.