04-06-2025 01:08:43 AM
- గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు వీహెచ్పీ వినతి
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో గో రక్షణ చట్టాలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విశ్వహిం దూ పరిషత్ (వీహెచ్పీ) గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఈ చట్టా లు సక్రమంగా అమలు కావటం లేదని వీహెచ్పీ నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో గో రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం సాయంత్రం వీహెచ్పీ నేతలు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాష్ట్రంలో గో రక్షణ కోసం చర్యలు చేపట్టాలని వినతిపత్రాన్ని సమర్పించారు. గోవులు హిందువుల మనోభావా లకు నిదర్శనమని కానీ తెలంగాణ సర్కార్ మాత్రం గోరక్షణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదని, పైపెచ్చు గో రక్షకులను పోలీసులు భయభ్రాంతులకు గురిచే స్తున్నారని వీహెచ్పీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గో రక్షణ కోసం చెక్పోస్టులు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ హోల్డింగ్ పాయింట్లలో ఎన్ని ఆవులను పట్టుకున్నారో, వాటిని ఎక్కడికి తరలించారనే అంశాలకు సంబంధించిన లెక్కలే లేవన్నారు. వేములవాడ దేవాలయ గోశాలలో నిత్యం కోడె దూడలు మరణిస్తున్నాయని, ఇది హిందువుల మనోభావాల ను తీవ్రంగా బాధిస్తోందన్నారు. సిద్దిపేటలో వందలాది గోహంతకులు వీహెచ్పీ కార్యకర్తలపై దాడులకు ప్రయత్నించారని వాపోయారు.
వీహెచ్పీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ సంబంధిత అధికారులతో మాట్లాడి గో రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని వీహెచ్పీ నేతలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ఆకుతోట రామారావు, వీహెచ్పీ నాయకులు రామరాజు, యాదగిరి రావు, డాక్టర్ రామ్సింగ్, రమేశ్, పగడాకుల బాలస్వామి ఉన్నారు.