గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి
సర్పంచ్ యాదగిరి యాదవ్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి27: గ్రామాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ నున్న యాదగిరి యాదవ్ అన్నారు.మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. గ్రామాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాండ్ర గోవర్ధన్,బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొడుసు వీరమల్లు,వార్డు సభ్యులు నున్న సురేష్,మాండ్ర అంజమ్మ,ఎఫ్ఎ పరశురాం,నాయకులు వల్లపు శ్రీనివాస్, తొడుసు మహేష్, అంజయ్య, మాండ్ర వెంకన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.




