12-11-2025 04:30:01 PM
కేంద్రీయ విద్యాలయం గోల్కొండ బోయిన్ పల్లి సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ కళాశాలలు
పటాన్ చెరు: విద్యాపరమైన ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా, కేంద్రీయ విద్యాలయం(గోల్కొండ, బోయిన్ పల్లి)లతో పాటు సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులు ఇటీవల హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ను సందర్శించారు. ఓపెన్ హౌస్ లో భాగంగా, సందర్శించడానికి వచ్చిన 11, 12వ తరగతి విద్యార్థులకు ముఖాముఖి ప్రదర్శనల ద్వారా నిర్మాణ అభ్యాసంపై సృజనాత్మక, లోతైన అవగాహనను కల్పించారు.
గీతం ఆర్కిటెక్చర్ అధ్యాపకులు, విద్యార్థులతో వారు మాట్లాడి, స్టూడియో సంస్కృతి, డిజైన్ ప్రక్రియలు, సృజనాత్మక సమస్య పరిష్కారంపై విలువైన సమాచారాన్ని పొందారు. ఈ సందర్శన ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు యువ అభ్యాసకులలో ఆర్కిటెక్చర్ ను సృజనాత్మక, విద్యాపరమైన అంశంగా ఎంపిక చేసుకోవడానికి ప్రేరణనిచ్చింది. వారి ఉత్సాహభరితమైన భాగస్వామ్యం డిజైన్ ఆధారిత విభాగాలపై పెరుగుతున్న ఆసక్తిని, అనుభవపూర్వక అభ్యాస విలువను ప్రతిబింబించింది. తదుపరి తరం డిజైనర్లు, ఆవిష్కర్తలను ప్రేరేపించడానికి గీతం యొక్క నిబద్ధతను ఈ చొరవ చాటిచెబుతోంది.