calender_icon.png 12 February, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

12-02-2026 12:00:00 AM

తెలంగాణ విద్యార్థి ఐకాసా చైర్మన్ వేముల రామకృష్ణ

ముషీరాబాద్, ఫిబ్రవరి11 (విజయక్రాంతి): క్రీడలు మనోధైర్యాన్ని,   సంకల్ప బలాన్ని,  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయ ని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు బుధవారం రాజేంద్రనగర్ లోని హరి హర క్షేత్రం మైదానంలో తెలంగాణ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గత మూడు రోజులు గా క్రికెట్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి 33 జట్లు పాల్గొన్నాయి. మొదటి విజేతగా రాజేంద్రనగర్ కు చెందిన పీకే టీం, రెండో విజేతగా బుద్వేల్ టీం నిలిచాయి. ఈ పోటీలలో గె లుపొందిన విజేతలకు వేముల రామకృష్ణ బహుమతులతో పాటు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇ శ్రీకాంత్, సాయి కిరణ్ యాదవ్, ప్రసాద్, సంతోష్, బాలు, ప్రణయ్, చేతన్,  అమన్, పాపి తదితరులు పాల్గొన్నారు.