calender_icon.png 9 June, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సునీతా రోదసీ యాత్ర వాయిదా

08-05-2024 12:04:21 AM

వ్యోమనౌకలో సాంకేతిక లోపమే కారణం

న్యూఢిల్లీ, మే 7: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర వాయిదా పడింది. ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమ నౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌లో సాంకేతిక లోపం ఏర్పడడమే దీనికి కారణం. లిఫ్ట్ ఆఫ్‌కు 90 నిమిషాల ముందు లోపాన్ని గుర్తించిన నాసా మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి మే 10న ప్రయోగం చేపట్టే అవకాశం ఉందని వెల్లడించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్‌లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్‌కు చెందిన అట్లాస్ వీ రాకెట్ నింగిలోనికి ఎగరడానికి సిద్ధమైంది. కానీ చివరి నిమిషాల్లో రాకెట్‌లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్‌లో సమస్య ఏర్పడడంతో ప్రయోగాన్ని నిలిపివేశామని నాసా వెల్లడించింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ బయటకు వచ్చారు. కాగా, స్టార్‌లైనర్‌తో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టడం ఇదే మొదటిసారి.