calender_icon.png 9 June, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు ఆభరణాల కంటైనర్ బోల్తా

08-05-2024 12:02:41 AM

వ్యాన్‌లో రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారం

సేలం (తమిళనాడు), మే 7: భారీ బంగారు ఆభరణాలతో వెళ్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని చిత్తోడ్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ కంటైనర్‌లో ఏకంగా రూ.666 కోట్ల విలువైన 810 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ వాహనం ఓ ప్రైవేటు కంపెనీకి చెందినదని తెలిసింది. చిత్తోడ్ సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం లో డ్రైవర్‌తో పాటు ఓ సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరు కుని వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే కంటైనర్‌లోని బంగారం సురక్షితంగానే ఉంది. సమాచారం తెలుసుకున్న బంగారం యజమానులు వెంటనే మరో వాహనంలో బంగారాన్ని తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.