03-06-2025 08:08:54 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రానికి చెందిన ఓడ్ కుల సంచారజాతి బిడ్డ చవాన్ అర్షితకు మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కార్యదర్శి సైదులు చేతుల మీదుగా హైదరాబాద్ లో మంగళవారం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో జిల్లా తృతీయ ర్యాంకు 573 సాధించడంతో ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా హర్షితకు కుటుంబ సభ్యులతో పాటు ఓడ్ కుల రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆమెను సంఘం తరఫున ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు.