calender_icon.png 5 June, 2025 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం అవాస్ యోజన పథకాన్నే ఇందిరమ్మ ఇండ్ల పథకంగా పేరు మార్చారు

03-06-2025 08:05:37 PM

సొమ్ము ఒకరిది - సోకు మరొకరిదిలా రేవంత్ పాలన..

కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తం.. 

అన్నారం కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు.. 

పెన్ పహాడ్: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు గూడు కల్పిస్తానని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు జాబితా అవకతవకలకు దారితీయడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు(BJP State Vice President Sankineni Venkateshwar Rao) ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అన్నారం బ్రిడ్జి గ్రామంలో బీజేపీ కార్యకర్తల మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా అపార్టీ మండల కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించారు.

ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఇండ్లను కేటాయిస్తే రేవంత్ ప్రభుత్వం ఈ పథకాన్ని 'ఇందిరమ్మ ఇండ్ల' పథకంగా పేరు మార్చుకోవడం సిగ్గుచేటని రాష్ట్రంలో 'సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది' లా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ నిధులతోనే రాష్ట్రం ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో రైతుల దుస్థితి అగమ్యగొచరంగా ఉందని, పండించిన పంట అమ్ముకోలేక.. నిర్వాహకులు, మిల్లర్లు తో ఇబ్బందులు.. ఎగుమతులు, దిగుమతులు కాగా ఇబ్బందులు.. ఇదంతారైతుల గోడు తెలిసి పట్టించుకోని అధికారులు.. మొత్తానికి రాష్ట్రంలో దోచుకోవడానికే తప్ప పేరుకే 'ప్రజా పాలన' కొనసాగిస్తున్నారని  హెద్దెవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, ఎండి అబీద్, పోకల రాములు, తూముల సాయి, నెమ్మాది నరేష్, రాపర్తి వెంకన్న, చెన్ను రమణారెడ్డి తదితరులు ఉన్నారు.