calender_icon.png 7 June, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చంద్రబాబును కలిసిన ‘తాళ్ల’

02-06-2025 02:40:16 AM

గుంటూరు, జూన్ ౧: ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును సెక్రటేరియట్‌లో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు తాళ్ల వెంకటేశ్‌యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీలో పట్టు వున్న నాయకుడుగా తాళ్లకు గుర్తింపు ఉండటంతో తనను చూసిన వెంటనే సీఎం పేరుపెట్టి పిలిచి ఆప్యాయంగా పలకరించారని వెంకటేశ్‌యాదవ్‌కు తెలిపారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అందరూ కలసి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని సీఎంకు తెలిపినట్లు పేర్కొన్నారకు. శంకర్ విలాస్ బ్రిడ్జి, మూడు వంతెనలు, గుంటూరు ఛానెల్, ఈఎస్‌ఐ ఆసుపత్రి  దశాబ్దాల కలను మన ప్రభుత్వ హయాంలో నెరవేరబోతున్నందుకు ధన్యవాదములు తెలిపారు.

రాష్ట్రంలో బీసీలకు నామినేటెడ్ పదవులలో పెద్దపీట వేస్తునందుకు, వైఎస్సార్సీపీ గుండాల చేతిలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిననందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.