calender_icon.png 17 June, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలను సవరించాలి

16-06-2025 12:00:00 AM

  1. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలి
  2. పెండింగ్ బిల్లులు, డి.ఎ.లను విడుదల చేయాలి
  3. టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్

కామారెడ్డి, జూన్ 15,(విజయ్ క్రాంతి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర కార్యాలయ హైదరాబాద్లో రాష్ట్ర అధ్యక్షలు సి.హెచ్. అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి రాష్ట్ర కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టినారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్, యం. లక్ష్మయ్య యాదవ్, బి.రాజు, రాష్ట్ర కార్యదర్శులు రావుల రమేష్, ఎస్.విజయ్, ఎస్.కవిత, దామెర రాజయ్యలు పాల్గొన్నారు.

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్. అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి లు మాట్లాడుతూ విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ప్రాథ మిక పాఠశాలలలో 60 లోపు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధనలు  ప్రాథమిక పాఠశాలల మూసివేతకు దారితీస్తాయని అన్నారు.

50 మంది విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5గురు ఉపాధ్యాయులు ఉండేలా నిబంధనలు సవరించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టుల టీచర్లకు పనిభారం సమానంగా ఉండేటట్లు చూడాలన్నారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ను రూపొందించి పాఠశాల విద్యారంగంలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని,

అన్ని యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యయులకు ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను విడుదల చేసి వెంటనే ప్రక్రియను ప్రారంభించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలను సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటికి ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని, అన్ని ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక తరగతులకు అనుసంధానం చేయాలని కోరారు. 

పెండిరగ్లో ఉన్న ఉపాధ్యాయుల, పెన్షనర్ల వివిధ రకాల ఆర్థిక బిల్లులను, వెంటనే విడుదల చేయాలని, పెండిరగ్లో ఉన్న  డి.ఎ.లను వెంటనే విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను బహిర్గతపరిచి వెంటనే అమలు చేయాలని, గురుకుల, మోడల్ స్కూల్, కెజిబివి, ఎయిడెడ్ టీచర్ల, ఉద్యోగులందరికీ ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ సాంకేతిక కారణాల వల్ల ఆ తర్వాత నియామకాలు పొందిన 2003 డి.ఎస్.సి. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, విద్యాశాఖలో విలీనం చేయాలని, విద్యారంగంలో కొనసాగుతున్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు పరిచి, కెజిబివి మరియు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయిలను రెగ్యులరైజ్ చేయాలని, 2008 డి.ఎస్.సి. కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.