17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్‌తో టీచర్ల సమస్యలు తీరవు

09-09-2024 01:22 AM
  1. రోడ్లపైకి వచ్చి కొట్లాడితేనే తీరుతై.. 
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాల ం టీచర్ల సమస్యలు తీరవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురువం దనం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భం గా ఆయన మాటా ్లడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశమే లేదని, రోడ్డెక్కి యుద్ధం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే పోరాటాలకు తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.

టీచర్లు తలుచుకుంటే తలరాతలే మారతాయని, ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. గతంలో టీచర్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సా ధించలేదని, విద్యార్థులు, ఉపాధ్యాయులతోనే సమాజంలో మార్పు మొదలవుతుందన్నారు. బీఈడీ అర్హుతలుండి ఎస్జీటీలుగా పనిచేస్తున్న టీచర్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతున్న విషయం కేంద్రంలోని హెచ్‌డీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఎన్‌సీటీఈ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేయి ంచేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, తపస్ రాష్ట్ర నాయకులు కట్టా రాజేశ్వర్, హనుమంతరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.