17-05-2025 12:00:00 AM
డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
కొత్తగూడెం మే 16 (విజయ క్రాంతి) : ఉపాధ్యాయులు పోక్స్కో, సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండాలని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ అన్నారు.శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం లో జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా , సైబర్ నేరాలపై ఉపాధ్యాయులందరికీ ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం నేరం చేయడమే కాకుండా, నేరాన్ని దాచిపెట్టడం కూడా నేరంగా పరిగణించబడుతుందన్నా రు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి పాఠశాల నుండి వెళ్లే వరకు కూడా ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని, తెలియని కాల్స్ కు సమాధానం ఇవ్వడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయి అందులో ఉన్న సొమ్ము మొత్తం చోరీకి గురవుతుందని , అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ సమాధానం ఇవ్వవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, 1 టౌన్ సిఐ కరుణాకర్ , ఎస్ఐ విజయ, రిసోర్స్ పర్సన్లు సైదులు, మీరా హుస్సేన్, మురళి హరిబాబు లు పాల్గొన్నారు.