26 April, 2026 | 8:50 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

17-09-2025 08:20 AM

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం(Central government) ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో నేడు తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు(Telangana Liberation Day Celebrations ) నిర్వహించనున్నారు. ముఖ్య అతిధిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు రాజ్ నాథ్ చేరుకుంటారు. సైనిక అమరవీరుల స్థూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళారూపాలను తిలకించనున్నారు. పికెట్ లోని పార్క్ లో మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయీ విగ్రహాన్ని రాజ్ నాథ్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకలో పాల్గొనున్నారు.