05-06-2025 01:48:20 PM
హైదరాబాద్: వియత్నాంలోని కాన్ థో సిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఒక విషాద ప్రమాదంలో 21 ఏళ్ల ఎంబిబిఎస్(MBBS student) మూడో సంవత్సరం విద్యార్థి అర్షిద్ అశ్రిత్ మృతి చెందాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి(Kagaznagar town) చెందిన బట్టల వ్యాపారులు అర్షిద్ అర్జున్, ప్రతిమా దంపతుల కుమారుడు అశ్రిత్ తన స్నేహితుడితో కలిసి అతి వేగంగా మోటార్ సైకిల్ నడుపుతుండగా అదుపు తప్పి ఇంటి గోడను ఢీకొట్టాడు. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది. ఆశ్రిత్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరొకరు చికిత్స పొందుతున్నారు. అశ్రిత్ ఆకస్మిక మరణ వార్త అతని కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ విషాద వార్త విన్న అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అశ్రిత్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.