22-05-2025 12:30:51 AM
-సొంతఖర్చులతో వారిని విడిపించిన బీఆర్ఎస్ నేత జాన్సన్నాయక్
-కోర్టులో జరిమానా కట్టి స్వదేశానికి తీసుకొచ్చిన బీఆర్ఎస్
-భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు: కేటీఆర్
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, దస్తురాబాద్ మండలం మూన్యాల్ గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు మలేషియాకు వెళ్లి అకారణంగా అరెస్ట్ అయి జైలుపాలయ్యారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత ఖానాపూర్ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని సూచించారు. కేటీఆర్ సూచనతో మార్చి నెలలో మలేషియా వెళ్లిన జాన్సన్ నాయక్, జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యము నూరి రవీందర్ను విడుదల చేయిస్తానని భరోసా కల్పించారు.
అక్కడి చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో అక్రమ ఆయుధ కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకున్న జాన్సన్ నాయక్, వారి విడుదల కోసం సొం త ఖర్చులతో స్థానిక న్యాయవాదులను ని యమించి న్యాయపరమైన ప్రక్రియను వేగవం తం చేశారు. ఇటీవల మే 12న మలేషియాకు మళ్లీ వెళ్లి అక్కడి కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని తన సొంత ఖర్చులతో చెల్లించి, విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి వారిని జాన్స న్ నాయక్ తీసుకువచ్చారు.
బుధవారం కేటీఆర్ను వారంతా కలిసి ఈ దేశాన్ని తమ పిల్ల లను మళ్లీ చూస్తామని అనుకోలేదని భావోద్వేగం చెందారు. కేటీఆర్, జాన్సన్ నాయక్ కృషితో తాము విడుదలయ్యామని, జీవితాంతం వారిని తమ గుండెల్లో పెట్టుకుంటా మని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మా ట్లాడుతూ.. భారత రాయబార కార్యాలయం కానీ, తెలంగాణ ప్రభుత్వంగానీ బాధితులను విడిపిం చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. మలేషియా వెళ్లి బాధితులను క్షేమంగా తెలంగాణకు తిరిగి తీసుకువచ్చిన భూక్యా జాన్సన్ నాయక్ ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.