03-08-2025 12:00:00 AM
వందేమాతరం శ్రీనివాస్
కేంద్రం ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటడం ఆనందంగా ఉందని ప్రజా నాట్య మండలి సినిమా శాఖ తెలిపింది. సంగీత దర్శకుడు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు వందేమాతరం శ్రీనివాస్తోపాటు కార్య దర్శి మద్దినేని రమేశ్, కోశాధికారి డాక్టర్ మాదాల రవి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
‘భగవంత్ కేసరి’ ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం, హను బలగం వంటి చిత్రాలకు అవార్డు రావడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ (బలగం) ఎంపిక కావడం, ఉత్తమ నేపథ్య గాయకుడు రోహిత్ (బేబి) అవార్డులు గెలుచుకోవడం తెలుగు సినిమాకు గర్వకారణమని పేర్కొన్నారు.
‘గాంధీతాత చెట్టు’ సినిమాలో తొలిసారిగా నటించిన సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. తెలుగు సినిమాకు ఇన్ని అవార్డులు ఒకేసారి రావడం ఇదే ప్రథమం అని హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా.. కథల ఎంపికలోనూ, మేకింగ్లోనూ పాన్ ఇండియా స్థాయి లో సత్తా చాటుతోందని వారు తెలిపారు.