16-06-2025 08:08:32 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri Matsyagiri Lakshmi Narasimha Swamy Temple) టెండర్స్ 2025-26 సంవత్సరమునకు గాను దేవస్థానంలో వివిధ సామాగ్రి అమ్ముకొనుటకు ఈనెల 17న పెంచాల్సిన టెండర్ ఈనెల 18కి వాయిదా వేయడం జరిగిందని ఈవో సల్వాద్రి మోహన్ బాబు తెలిపారు. ఈనెల 17న మంగళవారం టెండర్స్ నిర్వహించాల్సి ఉండగా దేవాదాయ ధర్మదాయశాఖ కమిషనర్, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యందు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నందున టెండర్స్ ను 18న బుధవారం రోజున నిర్వహించడం జరుగుతుందని టెండర్స్ లో పాల్గొనేవారు గమనించాలని ఆయన తెలిపారు.