16-06-2025 08:05:55 PM
మహదేవపూర్/భూపాల్ పల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలోని ఎనకపల్లి గ్రామంలో చింత సురేందర్ తన వ్యవసాయ పనులకు పోతూ మార్గ మధ్యలో రెడ్మీ కంపెనీకి చెందిన 13సి మొబైల్ ఫోను పోగొట్టుకోవడం జరిగింది. వెంటనే మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి మొబైల్ ఫోను గుర్తించి మొబైల్ ను స్వాధీనం చేసుకొని సోమవారం రోజున ఎస్సై పవన్ కుమార్ పోలీస్ స్టేషన్లో సురేందర్ కు అప్పగించడం జరిగింది. ఎస్సై మాట్లాడుతూ... ఎవరైనా మొబైల్ ఫోన్ పోతే బాధపడనవసరం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మొబైల్ ను రికవరీ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.