17-07-2025 09:21:28 PM
కోదాడ: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిస్కారం టీఎస్ పీఆర్టీయూ తోనే సాధ్యం అని జిల్లా ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నడిగూడెం మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు నాగేశ్వరరావు వీసాల కోటయ్యల ఆధ్వర్యంలో జిల్లా పిఆర్టియు అధ్యక్షులు తంగేళ్ళ జితేందర్ రెడ్డితో కలసి 2025-26 సంవత్సరానికి గాను సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.