18-12-2025 06:23:43 PM
- సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
- కూరెళ్ళ శివరామ్ ఆచార్య..
మునుగోడు (విజయక్రాంతి): రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంతో కలత చెంది తన ఆత్మత్యాగంతనైనా బీసీలు రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను సాధించుకోవాలని, తన ప్రాణాన్ని తృణప్రాయంగా అగ్నికి ఆహుతి చేసిన సాయి ఈశ్వరాచారి త్యాగం వెలకట్టలేనిదని కూరెళ్ళ శివరామ్ ఆచార్య అన్నారు. గురువారం 42% బీసీ రిజర్వేషన కోసం ఆత్మత్యాగం చేసుకున్న సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను జగద్గిరిగుట్టలోని వారి నివాసంలో కలిసి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పక్షాన సేకరించిన 65000 రూపాయల విరాళాలను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు కూరెళ్ళ శివరామ్ ఆచార్య కమిటీ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ చారి,త్రినాష్ చారి, ఈశ్వరా చారి, నాగేంద్ర చారి, నరేష్ చారి ఉన్నారు.