31 July, 2026 | 8:24 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

నంగునూరు పోలింగ్ బూత్‌ను సందర్శించిన ఏసీపీ

13-12-2025 10:26 PM

నంగునూరు: నంగునూరు మండలంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి శనివారం నంగునూరు పోలింగ్ బూత్‌ను సందర్శించారు. పోలింగ్ కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రం వద్ద అనుసరించాల్సిన బందోబస్తు ప్రణాళిక, భద్రతా చర్యలపై వారికి పలు కీలక సూచనలు చేశారు. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రం లోపల, వెలుపల అనుమానాస్పద కార్యకలాపాలు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.