12-12-2024 01:11:20 AM
* జలమండలి ఎండీ అశోక్రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో జలమండలి చేపట్టిన 90రోజుల ప్రణాళికతో సవరేజీ ఓవర్ఫ్లో, చోకేజీ ఫిర్యాదులు తగ్గినట్లు ఆ సంస్థ ఎండీ అశోక్రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ స్పెషల్ డ్రైవ్కు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న 220 ఎయిర్ టెక్ మిషన్లు, 146 సిల్ట్ తరలింపు వాహనాలు, సీవరేజ్ సిబ్బందితోనే అన్ని పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించి 70 రోజులు పూర్తయిందని చెప్పారు.