జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
31-03-2026 12:00 AM
కలెక్టర్ రాజర్షి షా ఆదేశం
ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ‘జనగణన నుంచి జన కల్యాణం‘ అనే నినాదంతో ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
స్థానిక టీటీడీసీ లో శనివారం ప్రారంభమై సోమవారం తో ముగిసిన ‘సెన్సస్-2027’ ఫీల్ ట్రైనర్ల 3 రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో కలెక్టర్ పాల్గొని ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్రా, పర్యవేక్షకులు నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు శ్రీహరి బాబు, యువరాజ్, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




