15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

17-01-2026 12:52 AM

ధర్మపురిలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

ధర్మపురి, జనవరి : ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలనీ జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను అదేశించారు. శుక్రవారం ధర్మపురి మండలకేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంజూరైనా ఇందిరమ్మ ఇండ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మించుకునే ప్రతి ఇంటికి తెలంగా ణ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు అందజేస్తుందన్నారు.ఇటుక, కంకర ధరల నియంత్ర ణకు, ఇండ్ల లబ్ధిదారులకు ధరలు అనుగుణంగా ఉండేలా అధికారులు కమిటీ ఏర్పా టు చేసుకోవాలని సూచించారు .ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వెనుకబడి ఉన్నట్లయితే వేగవంతం పెంచాలని,గడువులోపు వారికి కేటాయించిన టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకుఆర్థిక పరమైన సమస్యలుంటే ఐకేపి, మెప్మా సహకార సం ఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు.ఈకార్యక్రమంలో ఆర్డీవో మధు సూదన్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హౌసింగ్ డిఈ భాస్కర్, ఎమ్మార్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.