08-05-2025 12:00:00 AM
ఎర్ర జెండానే పేదవర్గాల అండ
కూనంనేని కృషితో బ్రిడ్జి, రోడ్ల నిర్మాణానికి రూ.6.32కోట్లు మంజూరు.
పెనుబల్లి గ్రామ సిపిఐ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం మే 7 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రజలు రాజకీయాలకు అతీతంగా స మిష్టిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అ న్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి గ్రామాన్ని సిపిఐ ప్రతినిధిబృందం బుధవారం సందర్శించి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. ఎర్ర జెండానే పేదవర్గాలకు, గ్రామీణ ప్రజలకు అండగా ఉంటుండదన్నారు. పెనుబల్లి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన రహదారి సమస్యను గుర్తించిన స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పెనుబల్లి బ్రిడ్జి పుననిర్మాణానికి రూ.6కోట్లు మంజూరు చేశారని, అదేవిధంగా గ్రామంలో రూ.32లక్షల వ్యయంతో అంతర్గత రహాదారులు, డ్రైన్లు నిర్మించడం జరిగిందన్నారు.
పెనుబల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయించి 150మంది ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. సమస్యలను గుర్తించి వాటి పరిస్కారంకోసం కృషి చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు.
సమావేశంలో నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, కిలారు ప్రసాద్, భవాని, ఇనుములా నర్సింహా రావు, బి భాస్కర్, బి కిరణ్, శరభ చారి, ఈ శ్రీను మురళి, పశయ్య, గాదె వెం కన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.