08-05-2025 12:00:00 AM
మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కొమ్మాలు నాయక్
గూడూరు/.మే 7 : (విజయ క్రాంతి) మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామ ప్రజల నీటి కొరతను తీర్చేందుకు మానుకోట శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ 14 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకు సంబంధించి బుధవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని నల్లాల బావి వద్ద ఎంపీడీవో ఎమ్మార్వో గూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కొమ్మాలు నాయక్ గూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎడ్ల నరేష్ రెడ్డిలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
కాగా గూడూరు మండల కేంద్రంలోని వాటర్ సమస్య రాకుండా 20 లక్షలతో చేపట్టిన పైపులను బొంబాయి కుంట నుండి ఎంపీడీవో ఆఫీస్ వరకు బొంబాయి కుంట నుండి నెక్కొండ రోడ్డు వరకు నీటి సమస్య లేకుండా 20 లక్షలతో ఈ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది కాగా ఎమ్మెల్యే సహకారంతో జిల్లా కార్యదర్శి కొమ్మాలు చెరువుతో ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
వేసవిలో గూడూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు నీటితో ఇబ్బందులకు గురికా వద్దనే ఉద్దేశంతో పనులు చేపట్టామని కొమ్మాలు నాయక్ అన్నారు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ మధు. మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చంటి స్వామి గూడూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాస మల్ల యాకయ్య. జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి రసూల్. జిల్లా సహాయ కార్యదర్శి అరేం వీరస్వామి.
మండల కార్యదర్శి సూర గంగయ్య గూడూరు టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు నాగరాజు. గూడూరు టౌన్ కార్యదర్శి సూర శ్రీను. మండల కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి సునీల్. గోనె శోభన్. శ్రీనివాస్, జోగయ్య, ఎడ్ల అశోక్ రెడ్డి, రుపిరెడ్డి వెంకట్ రెడ్డి, రసమల్ల రాములు,మండల శ్రీను. రాచర్ల నాగయ్య. హుస్సేన్. యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్ మనోజ్. చప్పట్ల రాము. మండల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.