16-07-2025 12:00:00 AM
పదిహేను రోజులైనా పట్టించుకోవట్లే కథనానికి స్పందించిన విద్యుత్ శాఖ
మహమ్మదాబాద్ జూలై 15 : మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో గత 15 రోజుల క్రితం నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఖాళీ పోయి మరమ్మతులు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తెలియజేస్తూ 15 రోజులైనా పట్టించుకోవట్లే అనే కథనం ఈనెల 14వ తేదీన విజయ క్రాంతి దినపత్రిక నందు ప్రచురితం అ యింది.
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ సత్యం స్పందించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రత్యేక ట్రాక్టర్ ద్వారా తరలించి మరమ్మతులు చే సేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతు లు విజయ క్రాంతి దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.