30-05-2025 12:21:49 AM
కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్ల నియామకం
జీపీల రికార్డులు స్వాధీనం
మేడ్చల్, మే 29(విజయ క్రాంతి): మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో గ్రామ పంచాయతీల శకం ముగిసింది. గురువారం నుంచి జి ల్లాలోని మొత్తం గ్రామాలన్నీ పురపాలక పరిధిలోకి వచ్చేసాయి. జిల్లాలో కొత్తగా ఏర్పా టు అయిన మూడు మున్సిపాలిటీలకు ప్ర భుత్వం కమిషనర్లను నియమించింది. ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్గా నిత్యానంద్, అ లియాబాద్ మున్సిపల్ కమిషనర్ గా చంద్రశేఖర్, మూడు చింతలపల్లి మున్సిపల్ కమి షనర్ గా పవన్ ను నియమించింది.
గురువారం వీరు గ్రామపంచాయతీల రికార్డుల ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితమే జిల్లాలోని గ్రామపంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో విలీనం చేయడానికి వీ లుగా మున్సిపల్ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గెజిట్ వి డుదల చేసింది.
జీవో విడుదల లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధికారు లు, సిబ్బందికి ఆప్షన్ ఇచ్చి ఇతర శాఖలకు బదిలీ చేయనున్నారు. జి ల్లా పరిషత్ సీఈవో కాంతమ్మను ఇదివరకే జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికా రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
పల్లెటూర్లకు పట్టణ హోదా!
కొత్తగా ఏర్పాటు అయిన మునిసిపాలిటీలలో అన్ని పల్లెటూర్లే ఉన్నాయి. పల్లెటూ ర్లకు పట్టణ హోదా కల్పించారు. వీటిని గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపాలిటీలుగా చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ను 15 మండలాలతో ఏర్పాటు చేశారు. ఇందు లో ఐదు మండలాలు మాత్రమే రూరల్ మండలాలు. 61 గ్రామపంచాయతీ లు ఉండేవి. ఇందులో 28 పంచాయతీలను ఐదు నెలల క్రితం సమీప మున్సి పాలిటీలలో విలీనం చేశారు.
కొత్త జిపి తో కలిపి 34 జీపీలు, మూడు జడ్పిటిసిలు మిగిలాయి. వీటితో జిల్లా పరిషత్ కొనసాగడం సాధ్యం కాదు. దీంతో ఈ గ్రామాలన్నీ ము న్సిపల్ పరిధిలోకి తెచ్చారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎల్లంపేట, డబ్బిలుపూర్, మైసి రెడ్డి పల్లి, కోనాయిపల్లి, నూతనకల్, శ్రీ రంగవరం, బండ మాదారం, లింగాపూర్, రావాలి కోల్, సైదోని గడ్డ తండా, సోమవారం, రాజ బొ ల్లారం, రాజ బొల్లారం తాండ, ఘన్పూర్ పంచాయతీలను విలీనం చేశారు.
మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో మూడు చింతలపల్లి, అడ్రస్ పల్లి, అనంతరం, జగ్గం కూడా, కేశవాపూర్, కేశవరం, కొల్తూరు, లక్ష్మాపూర్, లింగాపూర్ తండా, నాగిశెట్టిపల్లి, నారాయణపూర్, పో తారం, ఉద్దే మర్రి, పొన్నాల గ్రామపంచాయతీలు విలీనం చేశారు. అలియాబాద్ మున్సి పాలిటీలో అలియాబాద్, లాల్ గడి మలకపేట, మజీద్ పూర్, మురహరి పల్లి, తురక పల్లి యాదారం గ్రామపంచాయతీలు విలీనం చేశారు.
ఉపాధి హామీ బంద్
గ్రామీణులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపా ధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు. ఇది అన్ని గ్రామ పంచాయతీలలో అమలు చేస్తున్నారు. గ్రామపంచాయతీలు ముంచిపాలిటీ లలో విలీనం అయినందున ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ఉండదు. అంతేగాక పన్నులు పెరిగే అవకాశం ఉంది. పంచాయతీలతో పోలిస్తే మున్సిపాలిటీలలో పన్నులు ఎక్కువగా ఉంటాయి.