30-05-2025 12:21:49 AM
రాజాపూర్ మే 29 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జనంపల్లి శశికళ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వంశీకృష్ణ , ఎంపీఓ వెంకట్రాములు,హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోలేపల్లి యాదయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల వైస్ జనరల్ సెక్రెటరీ చుక్కా నరసింహులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.