11 April, 2026 | 3:51 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

ప్రజల ఐక్యతకు ప్రతీక బుగులోని జాతర

28-10-2025 12:00 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు

బుగులోని జాతర వాల్ పోస్టర్  ఆవిష్కరణ

రేగొండ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి  జాతర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సోమవారం ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జాతర గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న కొండలపై స్వయంభుగా వెలసి రెండో తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర వచ్చే నెల 4 వతేది నుండి 8 వతేది వరకు 5 రోజుల పాటు జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనా లని ఎమ్మెల్యే కోరారు. జాతరలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలకు ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహ దపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఓ బిళ్ళ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.