చనిపోయిన మున్సిపల్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహబూబాబాద్ మున్సిపాలిటీ లో కార్మికులు పనిచేస్తూ ఈ మధ్యకాలంలో చనిపోయినవారి కుటుంబలను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చైర్ పర్సన్, కమిషనర్లకు వినతిపత్రం అందజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మ రకుంట్ల నాగన్న మాట్లాడుతూ గతంలో కార్మికులు చనిపోతే వెంటనే వారి కుటుంబంలో ఒక్కరికిని పనిలో పెట్టుకుండేవారని, గత సంవత్సర కాలం నుండి చనిపోయిన వారి కుటుంబాలకు పనిలో పెట్టుకోకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల అం డగా ఉంటుందని భావించామని, అయితే అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన వారి కుటుంబాల్లో పని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్ప టికైనా తక్షణమే మరణించిన కార్మికుల కు టుంబాల సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, లేనియెడల మున్సిపాలిటీ కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు గుర్రాల పుష్పరాజ్, నగేష్, పుచ్చకాయలు ఎల్లయ్య, ఆవుల వీరన్న, ఇమ్మడి పద్మ, తప్పట శ్రీకాంత్, జానీ, మంజుల పాల్గొన్నారు.




