calender_icon.png 18 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తి కులాలకు పూర్వవైభవం

18-09-2025 12:00:00 AM

-మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, సెప్టెంబర్ (విజయక్రాం తి): చేతి వృత్తి కులాలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాను బీసీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేసానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడులు జోగు రామన్న అన్నారు. విశ్వకర్మ ఆలోచన విధా నం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నా రు. శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ ఆరాధనోత్సవాల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు.

మొదట కమిటీ సభ్యులతో కలిసి విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు. విశ్వకర్మ విగ్రహానికి, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జోగు రామన్న ప్రసంగిస్తూ కులవృత్తులకు జీవం పోసిన విశ్వకర్మలు ఆలోచన విధానం ఎంతో స్ఫూర్తివంతమైందన్నారు. బీసీలోని 27 కుల సంఘాలకు చెందిన బీసీ భవన్‌ను  నాలుగున్నర ఎకరాలలో గత బీఆర్‌ఎస్  ప్రభుత్వంలో భూమి పూజ చేసుకోవ డం జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమం లో  బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి,  బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు నర్సింలు, దశరథ్, యూత్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ పాల్గొన్నారు.