మతోన్మాదన్ని ఓడిస్తేనే భవిష్యత్తు

02-05-2024 01:08:29 AM

సంగారెడ్డి, మే 1 (విజయక్రాంతి): మతోన్మాదన్ని ఓడిస్తేనే దేశానికి, ప్రజలకు భవిష్యత్ ఉంటుందని సీఐటియూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ య్య అన్నారు. బుధవారం కార్మిక దినోవత్సవం సందర్భంగా పాశమైలారంలోని వివిధ పరిశ్రమల్లో జెం డా ఆవిష్కరించి, బైక్ ర్యాలీలు నిర్వహించారు. మోదీ మూడోసారి అధికారంలోని వస్తే దేశంలో ఉన్న సంస్థలను నాశనం చేస్తారని ఆరోపించారు. లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోవడంతో నిత్యం కోట్లాటలు జరుగుతు న్నాయ ని తెలిపారు. సమావేశంలో కార్మిక సంఘం నాయకులు వి.ఎస్. రాజు, శ్రీనివాస్, మల్లేశం, రోషన్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.