విద్యార్థినిని అభినందించిన మంత్రి

02-05-2024 01:07:24 AM

సంగారెడ్డి, మే 1(విజయక్రాంతి) : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థి మెహ్రీన్ సుల్తాన్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సన్మానం చేసి అభినందించారు. బుధవారం సంగారెడ్డిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన మెహ్రీన్ సుల్తాన్ తన తండ్రితో కలిసి మంత్రిని కలిశారు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులు సాధిం చి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యార్థిని అభినందించి ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.