12-08-2025 12:20:46 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
బిచ్కుంద, ఆగస్టు 11 : విద్యార్థుల భవిష్యత్తు రాష్ర్ట ప్రభుత్వ భవిష్యత్తు అని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్పగల్ మండల కేంద్రం లోని గురుకుల పాఠశాలను సందర్శించారు.పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థుల తో కలిసిఎమ్మెల్యే భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ.వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో సమస్యలు, మౌళిక సదుపాయాల గురించి ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ర్ట భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా అది ఖర్చు కాదు రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడి లాంటిదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ర్ట బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు.
అలాగే విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టాలని ఉద్దేశ్యంతో విద్యా కమీషన్ ఏర్పాటు, అంగన్వా డీలను ఫ్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చడం, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు 40% కాస్మోటిక్ చార్జీలు 200% పెంచడం జరిగిందని వివరించారు. కేవలం వసతులు కల్పిం చడమే కాదు విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలని లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా రాష్ర్టంలో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అ న్నారు, పారదర్శకంగా టీచర్స్ బదిలీలను కూడా నిర్వహించి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు.
గతంలో చాలిచాలని బడ్జెట్ తో విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన భోజనం అందించ లేదని, అరటి పండు ఇస్తే, గుడ్డు ఇవ్వలేదు, గుడ్డు ఇస్తే, పాలు ఇవ్వలేదు ఇలా ఎదో ఒక రకంగా మెనూలో కోత విధించేవారని అన్నారు.ఆకలి కడుపుతో విద్యార్థుల ఎదుగుదలకు చదువుకు నష్టం వాటిల్లుతుందని, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశా ల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రేషన్కార్డుల పంపిణీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను, నూతన రేషన్ కార్డు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డుఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు గొప్ప పథకాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగల శంకర్, కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షులు గంగాధర్, తాహసిల్దార్ వేణు గోపాల్, ఎంపిడివో గోపాలకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ భరత్ పాల్గొన్నారు.