16 March, 2026 | 2:19 PM

యాదవులను చిన్నచూపు చూస్తున్న సర్కార్

16-03-2026 12:26 AM

యాదవ జేఏసీ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం యాదవులను చిన్నచూపు చూస్తుందని యాదవ జేఏసీ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుంటే సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతామాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో యాదవ మేధావుల సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యా దవ్ హాజరై మాట్లాడుతూ 10 వేల కోట్లతో యాదవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాద వ్, రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు బెల్లి చంద్రశేఖర్ యాద వ్, గంగుల మధు యాదవ్ మేకల శివశంకర్ యాదవ్, లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం రవీందర్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.