calender_icon.png 13 November, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ప్రతిగింజా కొనుగోలు చేస్తుంది

13-11-2025 12:00:00 AM

యాచారం,  నవంబర్ 12 : ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని  డీసీసీబీ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య,అన్నారు. బుధవారం మండలంలోని నందివనపర్తి, చింతపట్ల, యాచారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా  రైతులకు తగిన ధర  సమయానికి చెల్లింపులు ఉంటాయని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధా రాణి  ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మస్క నరసింహ, బిఎన్‌ఆర్  ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.