calender_icon.png 14 November, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత ఇల్లు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యం

14-11-2025 12:00:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, నవంబర్ 13: పేదల గృహ నిర్మాణాలు వేగంగా నిర్మించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలంలోని ఎక్వాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలగాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం  ప్రధాన లక్ష్యమన్నారు. ఏఎంసీ  మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు,అధికారులు పాల్గొన్నారు.